Header Banner

విద్యార్థులకు గుడ్ న్యూస్! వేసవి సెలవులు ముహూర్తం ఫిక్స్.. ఎప్పటి నుంచే అంటే?

  Wed Apr 23, 2025 09:34        Education

తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు ఈ ఒక్కరోజే పని చేయనున్నాయి. ఏప్రిల్ 23వ తేదీతో అకడమిక్‌ ఇయర్‌ ముగుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రెండు రాష్ట్రాల్లో పాఠశాలలకు ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు జూన్‌ 11 వరకు కొనసాగుతాయి. తిరిగి పాఠశాలలు జూన్‌ 12న పునఃప్రారంభమవుతాయి. దాంతో అన్ని పాఠశాలలకు ఏప్రిల్‌ 23వ తేదీయే ఈ ఏడాదికి చివరి పని దినంగా ఉండనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ బడులన్నింటికీ ఏప్రిల్24వ తేదీతో తరగతులు ముగుస్తాయి.

మరోవైపు విద్యా సంవత్సరం ముగియడంతో డిప్యుటేషన్లపై పని చేస్తున్న ఉపాధ్యాయులు మంగళవారం విధుల నుంచి రిలీవ్‌ అయి చివరి పనిదినమైన ఏప్రిల్‌ 23న పాత పాఠశాలల్లో చేరాల్సి ఉంటుందని ఇప్పటికే జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా వేసవి ప్రారంభంకావడంతో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం అయ్యాయి. దీంతో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది తరహాలోనే ఈసారి వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ముందే ఒంటిపూట బడులు ప్రారంభించింది.

ఏప్రిల్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్‌ పాఠశాలలకు వేస‌వి సెల‌వులు మొదలవనున్నాయి. ఈసారి విద్యార్ధులకు మొత్తం 50 రోజులు పాటు స్కూళ్లకు వేస‌వి సెల‌వులుగా ప్రకటించారు. 2025- 26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు అందించేందుకు కొత్త పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. బడులు తెరిచిన తొలి రోజే అంటే జూన్ 12వ తేదీన విద్యార్ధులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. ఈ మేరకు దాదాపు నాలుగున్నర కోట్ల పాఠ్య పుస్తకాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


నాలుగు గోడల వెనుక కాదు… జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!


స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..


సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!


వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!


చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?


మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..


చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!


ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!


ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SummerVacation #APSchools #TelanganaSchools #SchoolHolidays #StudentUpdate #EducationNews